News March 20, 2024

నరసరావుపేట టీడీపీ టికెట్‌పై రగడ

image

నరసరావుపేట TDPలో టికెట్ రగడ కొనసాగుతోంది. నేడు అధిష్ఠానం మూడో జాబితా విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో YCP నేత జంగా కృష్ణమూర్తిని TDPలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. నరసరావుపేటలో ఎప్పటి నుంచో పార్టీని కాపాడుతున్న అరవింద్ బాబుకే టికెట్ ఇవ్వాలని మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ రామిరెడ్డి ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Similar News

News September 5, 2025

టీచర్స్ డే.. మీ అనుభవాలు?

image

ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం పిల్లలకు మరపురాని వేడుకగా నిలుస్తుంది. ఉదయం విద్యార్థులు స్వయంగా గురువుల వేషధారణలో స్కూల్ కి వచ్చి తరగతులను నిర్వహించేవారు. పాఠశాల ప్రాంగణం నవ్వులు, ఆటపాటలతో మార్మోగేది. బహుమతులు, శుభాకాంక్షలతో గురువులను సత్కరించడం విద్యార్ధులకు ఆనందం. ఈ వేడుకలు గురువు – శిష్య బంధానికి చిహ్నంగా నిలుస్తుంది. మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా COMMENT చేయండి.

News September 5, 2025

సంస్కృత ఉపాధ్యాయుడు నుంచి.. ప్రభుత్వ ఆస్థానకవి వరకు

image

‘అవధాని శిరోమణి’ బిరుదు అందుకున్న సంస్కృతాంధ్ర విద్వాంసుడు, అనేక భాషలు నేర్చిన పండితుడు చతుష్షష్ఠి కళలన్నీ నేర్చిన మహా మనీషి కాశీ కృష్ణాచార్యులు (1872-1967. గుంటూరు హైస్కూలులో సంస్కృత పండిత పదవిని నిర్వహించారు. 1961లో ఏపీ ప్రభుత్వ ఆస్థానకవి పదవిని చేపట్టి 1967లో మరణించేవరకు కొనసాగారు. 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరిని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. మొదటి అష్టావధానం వినుకొండలో జరిగింది. 

News September 5, 2025

రెవెన్యూ కల్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు: DEO

image

గుంటూరు జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శుక్రవారం రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు డీఈవో సి.వి రేణుక తెలిపారు. 9 మంది ప్రధానోపాధ్యాయులకు, తత్సమాన కేటగిరీలో 20 మంది స్కూల్ అసిస్టెంట్లకు, 25 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు.