News February 11, 2026

నరసరావుపేట: ‘తిరునాళ్లకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి’

image

త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం నరసరావుపేటలో SP కృష్ణారావుతో కలిసి ఆయన ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ ప్రదేశాలను క్రమబద్ధీకరించాలని, జనసందోహాన్ని నియంత్రించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.

Similar News

News February 21, 2026

మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి: సీతక్క

image

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క కోరారు. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా జాతరకు విశేష గుర్తింపు లభించేలా విస్తృత ప్రచారం కల్పించిన ట్రస్ట్‌ను అభినందించారు. కాగా జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మందికి పైగా హాజరయ్యారు.

News February 21, 2026

నేరేడుకు నీరు, పోషకాలు ముఖ్యం

image

నేరేడు తోటల్లో అధిక దిగుబడి రావాలంటే చెట్లకు తగిన పోషకాలను, నీటిని కూడా అందించాలి. అందుకే పంట పూత నుంచి పిందెలు, కాయలు ఏర్పడే దశలో నిపుణుల సూచనలతో తగిన మోతాదులో ఒకసారి యూరియా, పొటాష్ అందిస్తే అవి పండ్ల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే డ్రిప్ పద్ధతిలో తోటలకు నీరు అందిస్తుంటే.. ఎరువులను కూడా ఫర్టిగేషన్ పద్ధతిలో ఇవ్వాలి. దీని వల్ల మంచి నాణ్యతతో కూడిన దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది.

News February 21, 2026

నెల్లూరు: దశాబ్దాల కల’వరం’..!

image

డక్కిలి(M) ఆల్తూరుపాడు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయితే వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు తాగు, సాగు నీటి కొరత నుంచి బయటపడవచ్చు. దశాబ్దాల కల కావడంతో అది తీరితే వారికి వరమే. ఈ ప్రాజెక్ట్ కింద సోమశిల- స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను 56 KM మేరా చేపట్టాల్సి ఉండగా రూ. 733.778 కోట్లను పరిపాలన ఆమోదం కోసం పంపారు. అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.