News February 12, 2025

నరసరావుపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 45 వేల ఇంజెక్షన్

image

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటు వచ్చిన వారికి తొలి గంటలో ఇచ్చే రూ. 45వేలు విలువైన అత్యవసర టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ అందుబాటులో ఉందని సూపరింటెండెంట్ డా. రంగారావు తెలిపారు. ఎంతో ఖర్చుతో ఉన్న ఇంజెక్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. గుండె నొప్పి రోగులకు స్వాంతన చేకూరేలా ఇంజెక్షన్ పనిచేస్తుందని వివరించారు. ఫిజీషియన్ స్పెషలిస్ట్ చే వ్యాధిగ్రస్తులకు ఇంజెక్షన్ ఇస్తున్నామని తెలిపారు.

Similar News

News September 16, 2025

బాపట్లలో NDPS చట్టాలపై అవగాహన

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ఎస్బీ ఇన్‌స్పెక్టర్ నారాయణ NDPS చట్టాలు, వాటి అమలుపై పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని 100 మంది పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గంజాయి ఇతర మత్తు పదార్థాల క్రయవిక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని సూచించారు.

News September 16, 2025

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. రేపే అధికారిక ప్రకటన

image

TG: బీసీ నినాదంతో MLC తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. రేపు పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో గం.11AMకు ఈ కార్యక్రమం జరగనుంది. ‘బీసీల ఆత్మగౌరవ జెండా రేపు రెపరెపలాడబోతుంది. ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి చోట బీసీ జెండా ఎగరాలి’ అని మల్లన్న ఆకాంక్షించారు.

News September 16, 2025

చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి: MP కావ్య

image

మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. తిరుపతిలో మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ “POSH చట్టం అమలు, 2013” అనే అంశంపై పలు బ్యాంకుల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. పోష్ చట్టంపై మహిళలందరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీ పేర్కొన్నారు.