News March 18, 2025

నరసరావుపేట: బాలలకు ఆధార్ నమోదు చేపట్టాలి

image

జిల్లాలోని బాలలకు ఆధార్ నమోదు కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అరుణబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి నెలలో రెండు దఫాలుగా ఆధార్ క్యాంపులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 19-22 వరకూ, 25-28 వరకూ మొత్తం 8 రోజుల పాటూ పాటు క్యాంపులు ఈ క్యాంపుల ద్వారా జిల్లాలో 20వేల మంది బాలలకు ఆధర్ ఆధార్ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు.

Similar News

News March 18, 2025

సీఎం తిరుపతి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

image

సీఎం చంద్రబాబు ఈనెల 20, 21వ తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. 20వ తేదీ తిరుపతి మీదుగా తిరుమల చేరుకుంటారు. 21వ తేదీ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను అధికారులకు వివరించారు.

News March 18, 2025

జోగులాంబ గద్వాల జిల్లా నేటి ముఖ్య వార్తలు

image

@గద్వాల: ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు@ జమ్మిచెడు జమ్ములమ్మకు విశేష పూజలు.@ ఉత్తమ ఫలితాలు సాధించాలి:ఎమ్మెల్యే బండ్ల @మల్దకల్: శాశ్వత సర్వేయర్‌ను నియమించాలి.CPI @మానవపాడు:GOVT స్కూల్ పిల్లలు సత్తా చాటాలి.@ఇటిక్యాల:NREGS పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ @అయిజ: అందరూ రండి..రక్తదానం చేయండి.@వడ్డేపల్లి: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురవొద్దు.@గట్టు: ఎండ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

News March 18, 2025

సత్యసాయి: ‘ఆధార్ నమోదులో తప్పులు దొర్లరాదు’

image

ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు జరగకూడదని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో ఆధార్ నమోదుపై జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, జిఎస్‌డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధార్ కేంద్రాలలో నమోదు చేయాలని సూచించారు.

error: Content is protected !!