News December 25, 2025
నరసరావుపేట: రెవెన్యూ శాఖలో జమాబంది తెలుసా.?

రెవెన్యూ శాఖలో కీలకమైన జమాబందీ ప్రక్రియను గత కొన్ని ఏళ్లుగా ఉన్నతాధికారులు విస్మరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్ఓఆర్ ప్రకారం రికార్డుల సక్రమ నిర్వహణకు జమాబందీ అత్యంత కీలకమైనదైనా, ఏ కారణం చేతనో అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అనేక తహశీల్దార్ కార్యాలయాల్లో భూ సంబంధిత రికార్డుల నిర్వహణ సరిగా లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News December 31, 2025
2025: తెలుగు రాష్ట్రాల్లో వెలుగులు

2025లో AP, TGలు కీలక సంఘటనలకు వేదికలయ్యాయి.
• మే 2: అమరావతి పునర్నిర్మాణానికి PM మోదీ శంకుస్థాపన
• మే 31: Hydలో మిస్ వరల్డ్ పోటీలు.. థాయిలాండ్ సుందరి విజేత
• జూన్ 21: విశాఖలో 3 లక్షల మందితో యోగా దినోత్సవం
• ఆగస్టు 15: APలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ప్రారంభం
• అక్టోబర్ 14: విశాఖలో గూగుల్ రూ.1.35 లక్షల కోట్ల డేటా సెంటర్ ప్రకటన
• డిసెంబర్ 13: హైదరాబాద్లో మెస్సీ సందడి
News December 31, 2025
2025: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు

*Jan 8: తిరుపతిలో తొక్కిసలాట – ఆరుగురు మృతి
*Feb 22: SLBC టన్నెల్ ప్రమాదం – 8 మంది మృతి
*Apr 30: సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతి
*May 18: చార్మినార్ సమీపంలో అగ్ని ప్రమాదం-17 మంది మృతి
*June 30: సిగాచీ ఫార్మా కంపెనీ పేలుడు-54 మంది మృతి
*Oct 24: కర్నూలు వద్ద బస్సు దగ్ధం – 19 మంది మృతి
*Nov 1: పలాసలోని ఆలయంలో తొక్కిసలాట-9 మంది మృతి
*Nov 3: చేవెళ్ల బస్సు ప్రమాదం – 19 మంది మృతి
News December 31, 2025
ఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏయూ

రాష్ట్రవ్యాప్తంగా ఏపీసెట్ ప్రవేశ పరీక్ష మార్చి 28, 29వ తేదీల్లో జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఆంధ్రా యూనివర్శిటీ ఈరోజు విడుదల చేసింది. జనవరి 9వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ఏపీసెట్ అర్హతను పరిగణనలోనికి తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం www.apset.net.in వెబ్సైట్ను సంప్రదించండి.


