News March 15, 2025
నరసరావుపేట: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞ

స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అందరి సహకారంతోనే స్వచ్ఛ పల్నాడు సాధ్యమవుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే, డి.ఆర్.వో. మురళి, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 15, 2025
తడ: లారీ ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన తడ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కొండప్ప నాయుడు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి చెన్నై వైపు రోడ్డు మార్షన్లో నిలబడిన రవి అనే వ్యక్తిని లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో వ్యక్తి తలకు తీవ్రగాయాలు కాగా, అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని కుమారుడు అజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News March 15, 2025
రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

TG: గోషామహల్ BJP MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో BJP అధికారంలోకి వస్తే MIM పార్టీ అధినేత అసుదుద్దీన్ ఒవైసీ దేశాన్ని వదిలిపోయేలా చేస్తానని హెచ్చరించారు. ‘లేదంటే BJPలో చేరతానని మా నేతల కాళ్లు పట్టుకునేలా చేస్తాను. హోలీ జరగనివ్వకూడదని, నగరంలో హింస సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ ఆయనకు మెంటల్ హాస్పిటల్లో చికిత్స ఇప్పించాలి’ అని సూచించారు.
News March 15, 2025
Weather Report: బాబోయ్ ఎండలు.(జాగ్రత్త)

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 10రోజులుగా పోల్చుకుంటే 3.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారుగా 42డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణలు సూచిస్తున్నారు.