News March 7, 2025

నరసరావుపేట: 32 ఏళ్ల క్రితం ఇదే రోజున దారుణం

image

సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇదే రోజున నరసరావుపేటలో దారుణం జరిగింది. 1993 మార్చి 7న HYD నుంచి చిలకలూరిపేటకు వస్తున్న బస్సులో నరసరావుపేట రైల్వే క్రాసింగ్ వద్ద చలపతిరావు, విజయవర్ధన్‌రావు ఇద్దరు ఎక్కారు. ప్రయాణికులను బెదిరించి నగదు దోచుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించగా బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో 23 మంది మృతిచెందడం అప్పట్లో సంచలనమైంది.

Similar News

News November 22, 2025

NZB: ఇద్దరు SIలకు VRకు బదిలీ

image

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన బదిలీల్లో ఇద్దరు SIలకు VRకు బదిలీ చేసి అంతలోనే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ పేరిట మళ్లీ స్టేషన్లకు అటాచ్ చేశారు. ఇందులో భాగంగా NZBరూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ-1గా పని చేసిన మహమ్మద్ ఆరిఫ్‌ను డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు, నవీపేట ఎస్ఐగా పనిచేస్తున్న వినయ్‌ను నిజామాబాద్ 6వ టౌన్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 22, 2025

ప.గో: మాక్ అసెంబ్లీలో ‘రియల్’ పాలిటిక్స్?

image

మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళం నెలకొంది. క్విజ్‌లో ప్రతిభ చూపిన తాడేరుకు చెందిన ఉమా లిఖిత ఎంపికైనట్లు విద్యా శాఖ ప్రకటించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి నిమిషంలో జాబితా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన రాయకుదుర్రు విద్యార్థిని ఎంపిక చేయడం వెనుక రాజకీయ జోక్యం ఉందని ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

News November 22, 2025

ADB: ఆ తల్లి కడుపుకోత ఏ దేవుడు తీరుస్తాడు..!

image

వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. 4 రోజుల వ్యవధిలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువులు లోకం చూడకుండానే కన్నుమూశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిగా పట్టించుకోరని ఖర్చుకు వెనకాడకుండా ప్రైవేటుకు వెళ్తారు. <<18346927>>MNCL<<>>(D)లో 2 పసిప్రాణాలు, NRMLలో <<18346927>>మరొకరు<<>>, ADBలో <<18346927>>తల్లిబిడ్డ <<>>చనిపోయారు. పుట్టిన బిడ్డ ఆదిలోనే మరణిస్తే ఆ తల్లి కడుపుకోత ఏ దేవుడు తీర్చలేడు.