News January 7, 2025
నరసాపురం: ఫసల్ భీమా యోజన గడువు పెంపు

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువు ఈనెల 15 వరకు ప్రభుత్వం పెంచినట్లు వ్యవసాయశాఖ ఏడీఈ డాక్టర్ అనిల్ కుమారి తెలిపారు. సబ్ డివిజన్ లోని యలమంచిలి, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని రైతులు ఇంకా ఇన్యూరెన్స్ చెల్లించని పక్షంలో గడువులోపు చెల్లించుకోవాలన్నారు. దీని వల్ల పంటలు నష్టపోయినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బీమా పొందేందుకు వీలుంటుందన్నారు.
Similar News
News April 23, 2025
ప.గో: అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: కలెక్టర్

భవ్య భీమవరం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మంగళవారం కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ భవ్య భీమవరం సుందరీకరణ, మౌలిక వసతులు అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల పురోగతి, ఇంకా చేపట్టవలసిన పనులపై మున్సిపల్ అధికారులు,దాతలతో సమావేశమై సమీక్షించారు. కాస్మో పోలిటన్ క్లబ్ వద్ద వంశీకృష్ణ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.
News April 22, 2025
ఇబ్బందులు ఉంటే రైతులు తెలపాలి: జేసీ

ఉండి మండలం యండగండి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతు సేవ కేంద్రం ద్వారా కొనుగోలు సక్రమంగా జరుగుతుందా, అధికారులు మీకు సహకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలపాలన్నారు. రైతులతో కలిసి తేమ శాతం పరిశీలించారు.
News April 22, 2025
భీమవరం లాడ్జిలో పోలీసుల తనిఖీలు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ రెసిడెన్షియల్ & లాడ్జిపై టూ టౌన్ సీఐ కాళీ చరణ్ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో 9మంది అమ్మాయిలు, 9మంది అబ్బాయిలు ఉన్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లాడ్జి నిర్వాహకుడు అంతం శ్రీను పరారైనట్లు స్థానికులు తెలిపారు.