News March 27, 2024

నరసాపురం: TDP రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొవ్వలి

image

తాను అందించిన సేవలను అధిష్ఠానం గుర్తించి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చిందని ప్రవాసాంధ్రుడు కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నాయకులు అభినందించారు.

Similar News

News February 17, 2026

పోలవరం తెలుగుదేశంలో అంతర్మథనం

image

పోలవరం టీడీపీలో అంతర్మథనం ప్రారంభం అయింది. ప్రస్తుతం బొరగం శ్రీనివాస్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు. కాగా ఇంఛార్జ్ మార్పు ఉంటుందంటూ ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, కొవ్వాసి జగదీశ్వరి పేర్లు ఇన్‌ఛార్జ్ రేసులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో క్యాడర్ అయోమయంలో ఉంది. మరోవైపు గత ఎన్నికల్లో జనసేన టికెట్ దక్కించుకోవడంతో ఈ సారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని TDP నేతలు యత్నిస్తున్నారు.

News February 16, 2026

సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: SP

image

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా 15 అర్జీలను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూవివాదాలు, ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను SP ఆదేశించారు.

News February 16, 2026

నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్‌‌పై కేసు

image

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్‌లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.