News April 8, 2025
నర్వ: లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

నర్వ మండలం లంకాల గ్రామంలోని రేషన్ దుకాణంలో సోమవారం సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. అనంతరం రేషన్ కార్డు లబ్ధిదారులు రాములమ్మ ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నం భోజనం చేశారు. ఈ సంధర్బంగా రాములమ్మతో మాట్లాడారు. బియ్యం ఎలా వున్నాయని, అన్న ఎలా అయిందని అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Similar News
News February 21, 2026
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు: SP

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పోలీసు శాఖ తరపున పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా ప్రణాళికలు సిద్దం చేశామని, పరీక్షలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరిగేలా చూస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో యజామాన్యాలు సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు విద్యార్థులు తేవద్దన్నారు.
News February 21, 2026
T20WC.. సూపర్-8లో మ్యాచ్ రద్దయితే?

T20WC సూపర్-8లో ప్రతి జట్టు 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఏదైనా కారణాలతో మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే లేదు. అందువల్ల ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. దీంతో మిగిలిన మ్యాచ్లు కచ్చితంగా గెలవాలి. లేదా ఇతర గేమ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా ఇవాళ జరగాల్సిన న్యూజిలాండ్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా ఇప్పటికీ ప్రారంభమవలేదు. గ్రూప్-1లో IND, SA, WI, ZIM, గ్రూప్-2లో ENG, NZ, PAK, SL ఉన్నాయి.
News February 21, 2026
RR: వారికి 100% రాయితీతో రూ.60వేలు

రాళ్లు కత్తిరించే వృత్తిలో అనుభవం ఉన్న ముస్లింలకు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుడికి రూ.60 వేల చొప్పున, రూ.10 వేల విలువైన టూల్ కిట్, రూ.50 వేల విలువైన జనరేటర్ను 100% సబ్సిడీ కింద అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 1 వరకు http://tsobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


