News February 20, 2025

నర్వ: వేడి నీటిలో పడి 5 నెలల చిన్నారి మృతి

image

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడి తనుశ్రీ (5 నెలల) చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నర్వ మండల కేంద్రంలో జరిగింది. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు తనుశ్రీ అనే పాప ఉంది. తల్లి కుమార్తెను ఎత్తుకుని వేడి నీటి బకెట్‌కు తీసుకెళ్తోంది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు జారి బకెట్‌లో పడింది. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News November 1, 2025

సంగారెడ్డి: ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదల చేసినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షల జరుగుతాయని చెప్పారు. వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని ప్రిన్సిపల్స్‌కు సూచించారు. ఈ విషయాన్ని అన్ని కళాశాల ప్రిన్సిపల్స్ గమనించాలని కోరారు.

News November 1, 2025

నవంబర్ 1: చరిత్రలో ఈరోజు

image

1897: రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి జననం (ఫొటోలో ఎడమవైపు)
1956: ఉమ్మడి ఏపీతో పాటు కేరళ, మైసూరు, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల ఆవిర్భావం
1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఏర్పాటు
1973: నటి, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ జననం
1974: భారత మాజీ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ జననం
1989: తెలుగు సినీ నటుడు హరనాథ్ మరణం

News November 1, 2025

వరంగల్: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు!

image

ఆవుకు ఒకేసారి మూడు దూడలు జన్మించిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. అయితే, కృతిమ గర్భం ద్వారా మేలు జాతి రకాలైన దూడలు జన్మిస్తాయని, కృత్రిమ ఏఐ ద్వారా ఈ దూడలు జన్మించాయని గోపాల మిత్ర డా.అక్బర్ పాషా తెలిపారు. దీంతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు.