News September 8, 2025

నర్సంపేట: కలిసి కట్టుగా సరస్వతి నిలయాన్ని నిలబెట్టారు!

image

నర్సంపేట మండలంలో మారుమూల గ్రామమైన భోజ్యా నాయక్ తండాలో 15 ఏళ్ల కిందట సర్కారు బడి మూతపడింది. పక్క గ్రామాలకు వెళ్లలేక పలువురు విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపట్లేదని ఈ తండాకు చెందిన ఉద్యోగులు, యువకులు, రాజకీయ నాయకులు బడిని తెరిపించేందుకు ముందుకు వచ్చారు. తలా కొంత వేసుకొని రూ.లక్షలు వెచ్చించి ఈ ఏడాది తండాలో బడిని పున: ప్రారంభించారు. అక్షరాస్యత దినోత్సవం రోజున తండా వాసులను అభినందించక తప్పదు మరి..!

Similar News

News September 9, 2025

HYD: మోత మోగిన కరెంట్ బిల్లు.. హీటర్ కారణమే

image

గ్రేటర్ HYD పరిధి తార్నాక, మల్లాపూర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట సహా అనేక ప్రాంతాల్లో వాటర్ హీటర్లతో మీటర్ల రీడింగ్‌లు గిర్రుమని తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కరెంటు బిల్లు రాగా, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఉన్నవారికి 200 యూనిట్లు దాటింది. దీంతో కరెంటు బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి. పలువురికి రీడింగ్ ఎక్కువగా రావటానికి కారణాలు పరిశీలిస్తే, అనేక మంది అత్యధికంగా వాటర్ హీటర్లు వాడినట్లు తేలింది.

News September 9, 2025

ఉప రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారంటే..

image

ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. మనదగ్గర MLC ఓటింగ్ మాదిరే ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేయాలి. తర్వాత ఇష్టమైతే మరో అభ్యర్థికి రెండో ప్రాధాన్యత వేయొచ్చు. అయితే NDA, INDI కూటమి రెండో ప్రాధాన్యత ఓటు వేయొద్దని తమ ఎంపీలకు ఇప్పటికే స్పష్టం చేశాయి. అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.

News September 9, 2025

HYD: కీర్తి పురస్కారాలు-2024.. 48 మంది ఎంపిక

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏటా నిర్వహించే కీర్తి పురస్కారాలకు 2024 సంవత్సరానికి గాను 48 మందిని ఎంపిక చేసినట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు సోమవారం Way2Newsతో తెలిపారు. VC ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసిందని, ఈనెల 23, 24న నాంపల్లిలోని ఎన్టీఆర్ కళామందిరంలో ఎంపికైన వారిని సత్కరిస్తామన్నారు.