News December 14, 2025
నర్సాపూర్కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

చెన్నై–విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉ. 5.30కి బయలుదేరి ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.
Similar News
News February 17, 2026
ప్రకాశం: ‘చిన్నారి మృతి.. విచారణలో జాప్యమెందుకు’

సింగరాయకొండ నవోదయకోచింగ్ సెంటర్లో తౌశిక్ మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు దాటినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కారణమని వారు బహిరంగంగా చెబుతున్నా.. పోలీసులు వార్డెన్ను విచారించకపోవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. వార్డెన్పైనే తమకు అనుమానం ఉందని వారు బహిరంగంగా చెబుతున్నారు.
News February 17, 2026
GNT-గుంతకల్లు ట్రాక్.. గాజులపల్లి టన్నెల్ పూర్తి

రైల్వే శాఖ చేపట్టిన గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయింది. గజూలపల్లి-చెలుమ గ్రామాల మధ్య నిర్మిస్తున్న 320 మీటర్ల పొడవైన సొరంగ మార్గం (టన్నెల్) పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. సోమవారం ఈ సొరంగం చివరి అడ్డంకిని తొలగించి విజయవంతంగా అనుసంధానం చేశారు. పనులు పూర్తి కావడంతో రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. రవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఇది ఒక భారీ మైలురాయిగా నిలవనుంది.
News February 17, 2026
బీచ్ ఫెస్ట్ సక్సెస్.. పోలీసులను అభినందించిన SP

పాకల బీచ్ ఫెస్టివల్లో విశ్రాంతి లేకుండా పనిచేసిన పోలీసు సిబ్బందిని SP హర్షవర్ధన్ సోమవారం అభినందించారు. 2 రోజులపాటు అహర్నిశలు కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లు, హోంగార్డుల పనితీరును ఆయన ప్రశంసించారు. సింగిల్ రోడ్డు ప్రవేశ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, VIP కదలిక సమన్వయం సమర్థవంతంగా చేయడం అభినందనీయమని SP అన్నారు.


