News May 16, 2024
నర్సాపూర్: ఏసీబీ వలలో మరో వ్యవసాయ అధికారి
ఏసీబీ వలకు నర్సాపూర్ పట్టణ వ్యవసాయాధికారి గురువారం చిక్కాడు. రూ.30 వేల లంచం తీసుకుంటున్న నర్సాపూర్ మండలం వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో పట్టుకుని విచారణ చేపట్టారు. నర్సాపూర్లో ఒక అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేయగా సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఇటీవలి కాలంలో మెదక్ జిల్లాలో పలువురు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కారు.
Similar News
News October 5, 2024
సిద్దిపేట: కాసేపట్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
కొద్ది గంటల్లో కుమారుడి పెళ్లి జరగనుండగా అంతలోనే జరిగిన ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. ఈ విషాద ఘటన తొగుట మండలం వెంకట్రావుపేట వద్ద తెల్లవారుజామున జరిగింది. రాయపోల్ మండలం మంతూరు గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాసిం(మాజీ వీఆర్ఏ) కుమారుడు నిజాముద్దీన్ వివాహం ఈరోజు జరగాల్సి ఉంది. భార్య సాహెరా, మరో కుమారుడు వసీయోద్దీన్తో కారులో వస్తుండగా వెంకట్రావుపేట వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
News October 5, 2024
సంగారెడ్డి: ఇన్స్పైర్ మనక్కు దరఖాస్తు చేసుకోండి !
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 15లోగా ఇన్స్పైర్ మనక్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఇన్స్పైర్ మనక్కు దరఖాస్తు చేసుకునేలా ఉపాద్యాయులు కృషి చేయాలని కోరారు.
News October 5, 2024
వెంకట స్వామికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం
ట్యాంకు బండ్పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకట్ స్వామి జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని వెంకట స్వామి విగ్రహానికి ఎమ్మేల్యేలు వివేక్, వినోద్తో కలిపి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నైతిక విలువలను, ప్రజా స్వామ్య విలువలను ఏ విధంగా పరిష్కరించరించలేని అంశాలను కూడా అవలీలగా అధిగమించిన నేత వెంకట్ స్వామి అని కొనియాడారు.