News March 9, 2025

నర్సాపూర్ జి: ఉపాధ్యాయుడి అరెస్ట్

image

గత నెలలో పాఠశాల విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గణిత ఉపాధ్యాయుడు, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు కాగా అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. కాగా శనివారం గణిత ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రాజేశ్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

Similar News

News September 17, 2025

విశాఖలో పార్టనర్షిప్ సమ్మిట్-2025

image

నవంబర్ 14,15తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా పార్టనర్షిప్ సమ్మిట్-2025 నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లండన్‌లోని నారా లోకేశ్ గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో దూసుకెళ్తున్నామని చెప్పారు. పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశం అయ్యారు.

News September 17, 2025

మంచిర్యాల: అంతా స్వాతంత్ర్య సంబరాల్లో.. ఆయన మాత్రం జైలులో..!

image

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో లక్షెట్టిపేటకు చెందిన సంపత్ లాల్ సిసోడియా కీలక పాత్ర పోషించారు. అజ్ఞాతంలో ఉంటూ కుటుంబాన్ని నిజాం రజాకారులు ఎన్ని బాధలు పెట్టినా తెలంగాణ విముక్తి కోసం పోరాడారు. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య సంబరాల్లో ఉంటే సంపత్ లాల్ మాత్రం జైలులో ఉన్నారు. వల్లభభాయ్ పటేల్ సైనిక చర్యతో నిజాం తెలంగాణను భారత ప్రభుత్వానికి అప్పగించాక జైలు నుంచి విడుదల చేశారు.

News September 17, 2025

OG టికెట్ ధరలు భారీగా పెంపు

image

పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ టికెట్ ధరను రూ.1000గా పేర్కొంది. అంతేకాకుండా అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్ఠంగా రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలిపింది. మరోవైపు తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.