News February 1, 2025

నర్సాపూర్ (జి): మద్యం మత్తులో ఉరేసుకున్నాడు..!

image

నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన కోడె ప్రభాకర్(40) భార్య 4 ఏళ్ల క్రితం మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు.

Similar News

News March 13, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా.!

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అరుదైన మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.16,500 పలకగా, 5531 రకం మిర్చికి రూ. 11,000 ధర వచ్చింది. అలాగే 1048 మిర్చికి రూ.11 వేలు, టమాటా మిర్చికి రూ.32వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.37000 ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.

News March 13, 2025

TRAIN HIJACK: బందీలు విడుదల

image

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.

News March 13, 2025

HNK: గురుకులాల్లో నాణ్యమైన భోజనంపై దృష్టిని పెట్టాలి: కలెక్టర్

image

గురుకులాల్లో నాణ్యమైన భోజనం, పరిశుభ్రత, టాయిలెట్ల నిర్వహణ బాగుండే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, కస్తూరిబా విద్యాలాయాల్లో ఫుడ్ సేఫ్టీ, వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

error: Content is protected !!