News November 6, 2024

నర్సాపూర్ (జి): సుద్దవాగులో దూకి యువకుడు ఆత్మహత్య

image

సుద్దవాగులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ (జి) మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై హనుమాన్లు వివరాలు.. నిజామాబాద్ జిల్లా రాంనగర్‌కు చెందిన దినేష్ (22) తన భార్య బంధువులు బుర్గుపల్లికి వచ్చారు. నిన్న సాయంత్రం బయటకు వెళ్తునానని బైక్‌పై వెళ్లి గ్రామ సమీపంలోని సుద్దవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అన్నారు.

Similar News

News February 14, 2026

సైబర్ మోసాలపై అప్రమత్తతే రక్షణ: ADB SP

image

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. APK లింకులు, AI వీడియో కాల్స్, పెట్టుబడి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ వారం జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బాధితులు మోసపోయిన వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930కు ఫిర్యాదు చేస్తే నగదు తిరిగి పొందే అవకాశం ఉంటుందని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలపవద్దని ఆయన స్పష్టం చేశారు.

News February 14, 2026

ADB: పుర పీఠం.. బద్ధ శత్రువుల’ కలయిక నిజమేనా?

image

ADB మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠం దక్కించుకోవడం ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. మొత్తం 51 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 26 కాగా, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్(11), BRS(6), MIM(6) కలిసినా మెజారిటీకి ఇంకా ముగ్గురు స్వతంత్రుల మద్దతు అవసరం. మరోవైపు స్వతంత్రులు తమ వెంటే ఉన్నారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పరస్పర విరుద్ధ భావజాలం గల పార్టీలు పీఠం కోసం జతకడతాయా అన్నది వేచి చూడాలి.

News February 14, 2026

ఆదిలాబాద్: కువైట్ నుంచి వచ్చి.. కౌన్సిలర్‌గా గెలిచి

image

ఆదిలాబాద్‌ కువైట్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన మెహబూబ్ 33వ వార్డులో విజయం సాధించారు. విదేశాల్లో ఉన్నప్పుడు ‘గోల్డెన్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్’ ద్వారా భారతీయుల సమస్యలపై పోరాడారు. స్వగ్రామంపై మక్కువతో ఎన్నికల బరిలో నిలిచి ఓటర్ల ఆదరణ పొందారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. సేవా దృక్పథమే తనను గెలిపించిందని మెహబూబ్ పేర్కొన్నారు.