News February 8, 2025

నర్సీపట్నంలో అల్లూరికి చెందిన ఫారెస్ట్ ఉద్యోగి మృతి

image

నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు వెనుక టైరు కింద పడి పుట్టన్న అనే ఫారెస్ట్ ఉద్యోగి మృతి చెందిన విషయం తెలిసిందే. నర్సీపట్నం కూడలిలో బైక్‌పై వెళ్తుండగా హ్యాండీల్ అటుగా వెళ్తున్న బస్సుకు తగలడంతో ఈ ఘటన జరిగింది. దీనిపై టౌన్ సీఐ గోవిందరావు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్ మర్రిపాకల రేంజ్‌లోని పలకజీడి సెక్షన్ అధికారిగా పని చేస్తున్నారు.

Similar News

News March 2, 2026

చంద్రగ్రహణం.. రేపు ఆలయాలు మూసివేత

image

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు అన్నీ రేపు చంద్రగ్రహణం కారణంగా మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాలను ఉదయం 9 నుంచి రాత్రి 7.30 వరకు నిలిపివేస్తారు. మరోవైపు TGలోని యాదగిరిగుట్ట ఆలయాన్ని ఉదయం 7కే మూసివేస్తామని తిరిగి బుధవారం తెరవనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. రేపు నిర్వహించాల్సిన హోలికోత్సవాన్ని ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే శ్రీకాళహస్తి ఆలయం మాత్రం రేపు తెరిచే ఉంటుంది.

News March 2, 2026

ఇవాళ తెలంగాణకు రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ TGలో పర్యటించనున్నారు. ఉ.9.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. వికారాబాద్(D) అనంతగిరిలో జరుగుతున్న DCC అధ్యక్షుల శిక్షణా కార్యక్రమానికి హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేయనున్నారు. AP, TG కాంగ్రెస్ ముఖ్య నేతలతోనూ భేటీ కానున్నారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులనూ రాహుల్ కలిసే అవకాశం ఉంది.

News March 2, 2026

ఈనెల 15లోగా పరిహారం అందిస్తాం: మంత్రి పొంగులేటి

image

TG: వెలుగుమట్ల <<19243377>>భూవివాదాన్ని<<>> ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హెచ్చరించారు. అర్హులైన పేదలకు ఈనెల 15లోపు ఇళ్ల స్థలాలతో పాటు ₹5లక్షల పరిహారం ఇప్పిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అధికారుల తప్పు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా అక్రమ గృహాల తొలగింపుతో ₹250 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.