News February 18, 2025
నర్సీపట్నంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెండు రోజుల నుంచి తన స్వగ్రామమైన నర్సీపట్నంలో సందడి చేస్తున్నారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఇంటికి తల్లిని చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన అభిమానులు ఆయన్ను కలిసి ఫొటోలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు సోమవారం ఆయనతో భేటీ అయ్యారు.
Similar News
News January 8, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

▶అక్రమ గ్రావెల్ తవ్వకాలు సహించం: ఎమ్మెల్యే శిరీష
▶ఎల్.ఎన్ పేట: ఎరువులు అందక రైతుల ఆందోళన
▶పలాస: గంజాయితో నలుగురు వ్యక్తులు అరెస్ట్
▶వైసీపీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్గా తమ్మినేని కొనసాగింపు
▶టెక్కలి: చనిపోయిన పందులతో పరిశ్రమ ఎదుట నిరసన
▶సర్పంచ్పై దాడి.. ఎస్పీకి ధర్మాన కృష్ణచైతన్య ఫిర్యాదు
▶మందస: ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూములు ఇవ్వమని ప్రతిజ్ఞ
▶సోంపేట: రెచ్చిపోతున్న కోతుల గుంపులు
News January 8, 2026
రాత్రి పూట ఇవి తినొద్దు: వైద్యులు

నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఆకలి, నిద్రను కంట్రోల్ చేసుకునేందుకు ఏది పడితే అది తింటారు. మసాలా, నూనె పదార్థాలు, చిప్స్, బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్స్కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల కడుపులో మంట, గ్యాస్తో పాటు కొవ్వు పెరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ బదులు బాదం, బ్రోకలీ, బెర్రీస్, సలాడ్స్ వంటి హెల్తీ ఫుడ్ తీసుకెళ్లాలని, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.
News January 7, 2026
సింగరేణి హాకీ పోటీల్లో శ్రీరాంపూర్ జట్టు విజయం

డబ్ల్యూపీఎస్ & జీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి స్థాయి హాకీ పోటీలు ఈ రోజు ముగిశాయి. ఫైనల్స్లో శ్రీరాంపూర్ జట్టు, మందమర్రి, బెల్లంపల్లి ఏరియా జట్టు తలపడ్డాయి. ఈ పోటీల్లో శ్రీరాంపూర్ జట్టు విజయం సాధించింది. ముగింపు వేడుకలకు ఆర్జీ 1 జీఏం డీ.లలిత్ కుమార్ హాజరై ట్రోఫీ అందజేశారు. శ్రీరాంపూర్ జట్టు కోల్ ఇండియా పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.


