News February 7, 2025
నర్సీపట్నం యాక్సిడెంట్లో మరణించిన ఉద్యోగి వివరాలు

నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం బస్సు కిందపడి <<15385488>>మరణించిన <<>>ఫారెస్ట్ ఉద్యోగి వివరాలు తెలిసాయి. కొయ్యూరు మండలం మర్రుపాక సెక్షన్ ఆఫీసర్గా ఆర్.పుట్టన్న విధులు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నంలో నివాసముండే పుట్టన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం విధులకు బయలుదేరిన పుట్టన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరిలో విషాదం నిలిపింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది విచారణ వ్యక్తం చేశారు.
Similar News
News December 30, 2025
2025: క్రీడల్లో మన సివంగులదే డామినేషన్

ఈ ఏడాది క్రీడల్లో భారత మహిళలు సత్తా చాటారు. వన్డే WC, తొలి అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ మన ఆడబిడ్డలే గెలుచుకున్నారు. కబడ్డీ WCను దక్కించుకున్నారు. ఇక ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ 2025 ఛాంపియన్గా వైశాలి నిలిచారు. హాకీ ఆసియా కప్, అథ్లెటిక్స్, వరల్డ్ బాక్సింగ్ కప్లోనూ భారత నారీమణులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రెట్టించిన ఉత్సాహంతో వచ్చే ఏడాదికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించారు.
News December 30, 2025
రూ.8.41 కోట్లతో ‘మీ ఇంటికి-మీ డాక్టర్’: కలెక్టర్

మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.8.41కోట్లతో ‘మీ ఇంటికి-మీ డాక్టర్’ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆర్ఈసీ ఆర్థిక సహకారంతో మూడేళ్లు ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని వివరించారు. వచ్చేఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో గవర్నర్ చేతుల మీదుగా ఈకార్యక్రమం ప్రారంభం కానుంది. గిరిజనులకు ఈపథకం ఎంతోమేలు చేకూర్చనుందని ఆయన పేర్కొన్నారు.
News December 30, 2025
అలా సందుల్లో దూరడం విజ్ఞత అనిపించుకోదు.. సజ్జనార్ స్వీట్ వార్నింగ్

TG: న్యూ ఇయర్ వేడుకల వేళ యువతకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. చౌరస్తాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయనే భయంతో సందుల్లో దూరి, ప్రమాదకరంగా వాహనాలు నడపడం విజ్ఞత అనిపించుకోదని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడపడం మృత్యువును ఆహ్వానించడమేనని, ఒకవేళ యముడు వదిలేసినా చట్టం వదలదన్నారు. ‘మీ ప్రాణం విలువ మాకు తెలుసు. కాబట్టే ఈ హెచ్చరిక’ అని ట్వీట్ చేశారు.


