News January 16, 2026

నల్గొండలో నాగర్ కర్నూల్ జిల్లా వాసి హత్య

image

నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లికి చెందిన చంద్రును హత్యకు గురయ్యాడు. రైల్వే పనుల నిమిత్తం నల్గొండ జిల్లాకు వెళ్లిన చంద్రుకు, అక్కడ పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రాళ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న నల్గొండ 2వ టౌన్ ఎస్‌ఐ ఎర్ర సైదులు దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News February 4, 2026

14వ తేదీ నుంచి వేటను నిలిపివేయండి: జేడీ లక్ష్మణరావు

image

విశాఖలో జరగనున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్-2026 వేడుకల నేపథ్యంలో ఫిబ్రవరి 14 నుంచి 21వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. మూలపాలెంలో నిర్వహించిన సదస్సులో మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నేవీ సూచనలు పాటించాలని, బోట్లు సంచరించకుండా సహకరించాలని ఆయన కోరారు. తీర ప్రాంతాల పరిశుభ్రతపై కూడా మత్స్యకారులకు అవగాహన కల్పించారు.

News February 4, 2026

సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

image

UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 24వ తేదీ 6PM వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌ను <>క్లిక్<<>> చేయండి. SHARE IT

News February 4, 2026

అల్లూరి కలెక్టర్ కీలక ఆదేశాలు

image

అల్లూరి, పోలవరం జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక, అటవీ, ఐటీడీఏ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ‘హోం స్టే’ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.