News February 5, 2025
నల్గొండ: అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు
పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శన కోసం ఫిబ్రవరి 10 తేది సాయంత్రం 7గంటలకు అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్ల నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే.జాని రెడ్డి తెలిపారు. ప్రతి పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్ళే భక్తులకు ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని తెలిపారు.
Similar News
News February 5, 2025
NLG: తీన్మార్ మల్లన్న విమర్శనలను ఆయన విజ్ఞతకే :మంత్రి
గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు..వ్యక్తులు కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తీన్మార్ మల్లన్న బీ ఫాం నాకే ఇచ్చారు..పెద్ద ర్యాలీ చేశామని తెలిపారు. మల్లన్న విమర్శలను ఆయన విజ్ఞతికే వదిలేస్తున్నారు. కాంగ్రెస్ బీ ఫాం మీద గెలిచిన తీన్మార్ మల్లన్న నాపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు. బీసీ మీటింగ్ పెట్టి ఇతర కులాలను తిట్టడం వల్ల ప్రజల మధ్య మనస్పర్థలు వస్తాయన్నారు.
News February 4, 2025
NLG: ఎమ్మెల్సీ స్థానానికి రెండవ రోజు నామినేషన్ల దాఖలు నిల్
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైన విషయం తెలిసిందే. మొదటి రోజు ప్రజా వాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు ఒకసెట్ నామినేషన్ను దాఖలు చేశారు. మంగళవారం ఏలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో నామినేషన్ల పర్వం మొదలైన రెండవ రోజుకు ఒకే నామినేషన్ దాఖలైంది.
News February 4, 2025
UPDATE: దేవరకొండ మృతదేహం వెంకటేష్గా గుర్తింపు.!
దేవరకొండ పట్టణ శివారులోని తాటికోల్ రోడ్డు భాగ్యనగర్ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతుడు ఉప్పునూతల వెంకటేష్ యాదవ్గా కుటుంబీకులు గుర్తించారు. మృతుడు వెంకటేష్ చనిపోయే మనస్తత్వం కాదని, చాలా ధైర్యం కలవాడని కుటుంబీకులు తెలిపారు. వెంకటేష్ మృతిపైన పలు అనుమానాలు ఉన్నాయని, హత్య చేసి, ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు.