News March 4, 2025
నల్గొండ: ఇంటర్ పరీక్షలకుసర్వం సిద్ధం: డీఐఈఓ

రేపటి నుంచి ప్రారంభంమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని డీఐఈఓ దశ్రు నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు గంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
Similar News
News March 4, 2025
BREAKING: నల్గొండ: 134 పంచాయతీ సెక్రటరీలకు ఛార్జ్ మెమోలు

తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 134 మంది పంచాయతీ సెక్రటరీలకు నల్గొండ డీపీవో వెంకయ్య ఇటీవల ఛార్జ్ మెమోలు జారీ చేశారు. అయితే మళ్లీ ఈరోజు మరోసారి ఛార్జ్ మెమోలు జారీ చేయడంతో వారు ఆందోళనలో ఉన్నారు. గతంలో వారు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు డుమ్మా కొట్టినందుకు వారిపై విచారణ కొనసాగుతోందని వెంకయ్య తెలిపారు. కాగా, మానవతా దృక్పథంతో అప్పట్లోనే కలెక్టర్ వీరిపై చర్యలు తీసుకోవద్దన్నారు.
News March 4, 2025
నల్గొండ: పోలీసులకు ఎస్పీ స్ర్టాంగ్ వార్నింగ్..

నార్కట్పల్లి మండలం అమ్మనబోలు మూసీ పరివాహక ప్రాంతంలో మంగళవారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వెయ్యాలని పోలీసులను ఆదేశించారు. అమ్మనబోలులో ఇవాళ నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ప్రతి వాహనం వివరాలు నమోదు చేయాలన్నారు. అక్రమ ఇసుక తరలించేవారికి సహకరించే పోలీసులు, అధికారులపైనా చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.
News March 4, 2025
నల్గొండలో రేపు మంత్రి కోమటిరెడ్డి పర్యటన

జిల్లాలో రేపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించనున్నారు. ఉ.8గంటలకు HYD నుంచి బయలుదేరి ఉ.10గంటలకు కనగల్ మండలం చేరుకుంటారు. కనగల్ పట్టణంలో నిర్మించిన కొత్త PHCని ప్రారంభిస్తారు. అనంతరం సెంటర్ ఫర్ లైఫ్ సైన్సెస్, మహీంద్రా యూనివర్సిటీల సహకారంతో చేస్తున్న గ్లకోమా పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవలో పాల్గొంటారు. కస్తూర్భా పాఠశాలను సందర్శిస్తారు. మ.1:15కు నల్గొండలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.