News March 5, 2025
నల్గొండ: ఇంటర్ వార్షిక పరీక్షలను సవ్యంగా నిర్వహించాలి: కలెక్టర్

రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సవ్యంగా నిర్వహించేందుకు గాను పరీక్షలు నిర్వహించే కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ను విధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని తహశీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు ఆమే ఉత్తర్వులు జారీ చేస్తూ ఇంటర్మీడియట్ పరీక్షల సక్రమ నిర్వహణకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలు జరిగే సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News November 4, 2025
NLG: పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

వివిధ ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులు, పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తన చాంబర్లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఎత్తిపోత పథకాల కింద భూసేకరణ, పునరావస పనులపై సమీక్ష నిర్వహించారు.
News November 4, 2025
నల్గొండ: ‘గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు స్వీకరించాలి’

రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆహార భద్రత కార్డులను మంజూరు చేస్తున్న సందర్భంగా గృహజ్యోతి పథకానికి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని నూతన లబ్ధిదారులు కోరుతున్నారు. రేషన్ కార్డ్ లేకపోవడం వల్లే గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో తమ దరఖాస్తులు అధికారులు స్వీకరించలేదని వారు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారు 60 వేల మంది నూతన కార్డుదారులు ఉన్నారు.
News November 4, 2025
NLG: ఆందోళన బాటలో ప్రైవేట్ కాలేజీలు

జిల్లాలు ప్రైవేట్ కళాశాలలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియింబర్స్మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాబితాన్ని నిరసిస్తూ ఎంజీయూ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు కళాశాల నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. సోమవారం నుంచి తరగతులతో పాటు కళాశాలల బంద్ చేపట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల ఎదుట బంద్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.


