News February 26, 2026
నల్గొండ: ఉగాది పచ్చడికి వేప పూత కరువేనా..!

తెలుగువారి నూతన సంవత్సరం ఉగాదికి వేప పూత ప్రధానం. అయితే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేప చెట్లను పట్టి పీడిస్తున్న ‘డైబ్యాక్’ శిలీంధ్ర వ్యాధి కారణంగా చెట్లన్నీ మోడువారుతున్నాయి. ఈ వ్యాధి ప్రభావంతో ఈ ఏడాది ఉగాది పచ్చడికి వేప పూత దొరకడం కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. పండుగ నాటికి ప్రకృతి సిద్ధమైన ఈ పూత లభించదని భక్తులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 27, 2026
సీఎంలుగా చేసి ఇతర పార్టీల్లోకి జంప్!

ఒక పార్టీ నుంచి రాష్ట్రానికి CMగా వ్యవహరించినా రాజకీయ సమీకరణాలు, అవకాశాల కోసం పలువురు పార్టీ మారడానికి వెనకాడటం లేదు. తాజాగా TN మాజీ సీఎం <<19250954>>పన్నీర్ సెల్వం<<>> DMKలో చేరారు. INC నుంచి CMలుగా చేసిన అశోక్ చవాన్(మహారాష్ట్ర), కిరణ్కుమార్రెడ్డి(AP), అమరీందర్(పంజాబ్) BJPలో చేరారు. చంపై సోరెన్(ఝార్ఖండ్) JMM నుంచి BJPలోకి వెళ్లారు. జగదీశ్ షెట్టర్(కర్ణాటక) BJP నుంచి INCలోకి వెళ్లి మళ్లీ సొంతగూటికి చేరారు.
News February 27, 2026
HYD: మామూళ్ల మోజులో అధికారులు.. మెమోలు..!

శివారు కాలనీల్లో నీటికోసం జనం తపిస్తుంటే అధికారులు మాత్రం ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపారు. కావాలనే పైపులైన్లలో ప్రెజర్ తగ్గించి ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఫిల్లింగ్ పాయింట్ల వద్దే తక్కువ ధరకు నీటిని నింపుకొని బయట రూ.2000 వరకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాలో కిందిస్థాయి నుంచి పైదాకా వాటాలు వెళ్తున్నాయని తేలడంతో కొందరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.
News February 27, 2026
చెప్పినట్టే కడిగిన ముత్యంలా బయటికొచ్చా: కవిత

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్చిట్ లభించడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. ఈ కేసు కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే మోపారని తాను తెలంగాణ ప్రజలకు మొదటి నుంచీ చెప్తూ వస్తున్నట్లు తెలిపారు. ‘కడిగిన ముత్యంలా వస్తానని ముందే చెప్పాను. అదే జరిగింది. కష్టసమయంలో అండగా నిలబడ్డ జాగృతి కార్యకర్తలు, భర్త, అత్తామామలు, కొడుకులకు ధన్యవాదాలు’ అని అన్నారు.


