News March 10, 2025
నల్గొండ: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు

ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సోమవారం అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 13, 2026
జగిత్యాల: చివరి రోజు 99.93% హాజరు

జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. నేడు జరిగిన చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్షకు 68 కేంద్రాల్లో 12,694 మందికి గాను 12,685 మంది హాజరై 99.93% హాజరు నమోదైంది. 9 మంది గైర్హాజరయ్యారు. సప్లమెంటరీలో 2 మందిలో 1 విద్యార్థి హాజరై 50% నమోదైంది. అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాము తెలిపారు.
News April 13, 2026
కనకాంబరంలో పిండి నల్లి కట్టడి ఎలా?

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News April 13, 2026
‘పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి’ అనే విధానానికి మేము వ్యతిరేకం: CM

TG: NDA ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలోని కీలకశాఖల్లో ఏవీ సౌత్ స్టేట్స్కు ఇవ్వడం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి’ అనే విధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మహిళా బిల్లును అడ్డుపెట్టుకొని డీలిమిటేషన్ చేయొద్దన్నారు.


