News October 13, 2025
నల్గొండ: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి

చిట్యాలకు చెందిన బోరు బండి యజమాని ఒడిశాలో ఏనుగుల దాడిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రారపు సైదులు దసరాకు ఇంటికి వచ్చాడు. బోరు పనుల కోసం శనివారం ఒడిశాలోని దేన్ కనాల్ జిల్లాలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి ఒక్కసారిగా వచ్చిన ఏనుగుల గుంపు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం మృతదేహన్ని చిట్యాలకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News October 13, 2025
నల్గొండ జిల్లాలో 32.9 MM వర్షపాతం నమోదు

నల్గొండ జిల్లాలో ఆదివారం 32.9 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా NKPలో 78.9 మిల్లీమీటర్లు, చిట్యాలలో 30.0, కట్టంగూరులో 19.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నకిరేకల్లో 13.7, కేతేపల్లిలో 17.6, తిప్పర్తిలో 23.2, నల్గొండలో 12.7, కనగల్లో 55.8, అనుములలో 76.2, నిడమనూరులో 41.2, త్రిపురారంలో 31.8, మాడుగులపల్లిలో 59.2, వేములపల్లిలో 32.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News October 13, 2025
NLG: 154 షాపులు.. 163 దరఖాస్తులు!

జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తు డిపాజిట్ (నాన్ రిఫండబుల్) రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో ఆశావహులు అంతగా ఆసక్తి చూపడం లేదు. గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై 17 రోజులైనా 154 షాపులకు ఇప్పటివరకు 163 దరఖాస్తులే రావడంతో అధికారులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
News October 13, 2025
NLG: పొలిటికల్ హీట్ పెంచిన డీసీసీ పీఠం

NLG జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. వ్యూహ ప్రతివ్యూహాలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. రాబోయేది స్థానిక ఎన్నికల కాలం కావడంతో పార్టీ బీఫామ్స్ అన్నీ డీసీసీ అధ్యక్షుడి చేతుల మీదుగా పంపిణీ అయ్యే అవకాశం ఉంది. డీసీసీ పీఠం.. బీసీ, ఎస్సీలకు అసలు అవకాశమే ఇవ్వరా అని వారు అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు.