News December 2, 2025

నల్గొండ: గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం!

image

తొలిదశ నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఒకటే టెన్షన్ పట్టుకుంది.
జిల్లాలో అనేక పంచాయతీలో ప్రతీ పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామస్థాయి కార్యకర్తలు ఏళ్లుగా స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా ఆ అవకాశం రాగానే ఎగిరి గంతేసి బరిలోకి దూకారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవు గానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ.

Similar News

News April 13, 2026

నిర్మల్: ఒకే గ్రామం నుంచి ఇద్దరు టాపర్లు..!

image

మామడ మండలం కొరిటికల్ గ్రామం ఇంటర్ ఫలితాల్లో విద్యానగరిగా మారింది. సామల హర్షిత ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 996/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. అదే గ్రామానికి చెందిన వినీష ప్రథమ సంవత్సరంలో 469/470 మార్కులతో సత్తా చాటింది. ఒకే గ్రామం నుంచి ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడంతో గ్రామస్థులు సంబరాలు జరుపుకుంటున్నారు.

News April 13, 2026

ఇంటర్ ఫలితాలు.. 8 మంది విద్యార్థుల ఆత్మహత్య

image

TG: ఇంటర్ ఫలితాల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షల్లో పాసవ్వలేదనే కారణంతో పలు జిల్లాల్లో ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎగ్జామ్స్‌లో విఫలమవడమంటే జీవితంలోనే ఓడిపోవడం కాదనే విషయాన్ని మరిచి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. మార్కులే భవిష్యత్తు కాదనే విషయాన్ని పిల్లలకు పేరెంట్స్, టీచర్స్ అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలి.

News April 13, 2026

ఖమ్మం: ఫీజు చెల్లింపునకు 20వరకు అవకాశం

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఐఈవో కె.రవిబాబు సూచించారు. వచ్చే నెల 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈమేరకు ఈనెల 20లోగా ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా ఈనెల 20వరకు tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.