News December 1, 2025
నల్గొండ: గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో జిల్లా మంత్రులు

రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ను పరిచయం చేస్తూ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎంతో కలిసి వారు ఆవిష్కరించారు.
Similar News
News December 8, 2025
టెట్ పరీక్షలకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు: జేసీ

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరంలో 5, నరసాపురంలో 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
News December 8, 2025
మహిళలకు అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు: కలెక్టర్

మహిళలకు తగిన అవకాశం కల్పిస్తే ఏ రంగంలోనైనా రాణించగలరని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో, ఐదు రోజుల ఈవెంట్ మేనేజ్మెంట్ శిక్షణను పూర్తి చేసిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను మహిళా SHG సభ్యులకు అప్పగించేలా అవకాశాలు కల్పించాలని DRDO సురేందర్ను ఆయన ఆదేశించారు.
News December 8, 2025
స్టేజ్ 2 ఆర్ఓల పాత్ర కీలకం: ASF కలెక్టర్

సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికల నిర్వహణలో స్టేజ్ 2 ఆర్ఓల పాత్ర కీలకమైనదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం ASF కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ అధికారులతో కలిసి రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సక్రమంగా జరిగేందుకు సహకరించాలని సూచించారు.


