News January 22, 2026
నల్గొండ జిల్లాలోనూ భూభారతి కుంభకోణం..!

నల్గొండ జిల్లాలోనూ భూభారతి కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని చిట్యాలలో ఆరు, గట్టుపల్ లో మూడు, నాంపల్లిలో ఒకటి, చండూరులో ఒకటి చొప్పున రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్లు నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దాదాపు 11 రిజిస్ట్రేషన్లలో సుమారు నాలుగు లక్షల మేర కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. వాటిపై నివేదికలను రూపొందించి సీసీఎల్ఏకు పంపించినట్లు సమాచారం.
Similar News
News February 19, 2026
NLG: బాధితుడికి అండగా నిలిచిన కలెక్టర్

నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ తన ఉదారతను చాటుకున్నారు. కొండమల్లేపల్లి పర్యటన నుంచి తిరిగి వస్తుండగా ధర్వేశిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన ఆయన, వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడైన పరశురామ్ను పరామర్శించారు. స్వయంగా అంబులెన్స్కు సమాచారం అందించి, బాధితుడిని ఆసుపత్రికి పంపే వరకు అక్కడే ఉండి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కలెక్టర్ సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడుతున్నారు.
News February 19, 2026
NLG: నిరుద్యోగులకు ‘న్యాక్’ (NAC) ఉచిత శిక్షణ, ఉపాధి

నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతకు జాతీయ నిర్మాణ అకాడమీ (NAC) ఉచిత శిక్షణతో పాటు 100% ఉపాధి కల్పించనుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎలక్ట్రీషియన్, సూర్యమిత్ర సోలార్ పీవీ ఇన్స్టాలర్ కోర్సులకు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలి. 90 రోజుల శిక్షణలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తారు. ఆసక్తి గల వారు నల్గొండ ఐటీఐలోని NAC కార్యాలయంలో లేదా 7893332674, 8297431655 నంబర్లలో సంప్రదించవచ్చు.
News February 19, 2026
నల్గొండ: పంట సర్వేకు వాలంటీర్ల నియామకం

నల్గొండ జిల్లాలో యాసంగి పంటల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిజిటల్ సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్ను నియమించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సర్వే నమోదుకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. 2 రోజుల్లో లోపు నియామకాలు పూర్తి చేసి, నెల చివరిలోగా సర్వే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో 5.66 లక్షల ఎకరాల పంట వివరాలు సేకరించనున్నారు.


