News March 19, 2024
నల్గొండ జిల్లాలోనే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార యంత్రాంగాలు కసరత్తు చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలును గుర్తించింది. ఒక్క నల్గొండ జిల్లాలోనే మొత్తం 1766 పోలింగ్ కేంద్రాలకు గానూ.. 439 పోలింగ్ కేంద్రాలను సమస్మాత్మకమైనవిగా తేల్చగా.. మరో 247 ప్రాంతాలను ఘర్షణ జరిగే ప్రాంతాలుగా గుర్తించారు.
Similar News
News October 28, 2025
NLG: 21 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు 21 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. 1951 నుంచి 2004 వరకూ 8 సార్లు SIR నిర్వహించారు. చివరి సారిగా 21 ఏళ్ల క్రితం 2002-2004 మధ్య చేపట్టారు. జిల్లాలో బీఎల్వోలు త్వరలోనే మ్యాచింగ్ కాని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓట్లు ఎలా పొందారో.. దానికి కావాల్సిన పత్రాలను ఓటర్ల నుంచి స్వీకరించనున్నారు.
News October 28, 2025
NLG: కొనుగోలు కేంద్రాలు సరే.. స్థలమేదీ..!

నల్గొండ జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. కోసిన ధాన్యం ఎక్కడ ఆరబెట్టాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకూ సరిపడా స్థలం లేదు. పది నుంచి 20 రాశులు రాగానే స్థలం కొరత ఏర్పడుతోంది. ధాన్యం సేకరణకు జిల్లాలో ఇప్పటికే 85% ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో కేవలం కొన్ని కేంద్రాలకే అనువైన స్థలాలు ఉన్నాయి. మిగతా కేంద్రాలకు సరైన స్థలాలే లేవని రైతులు అంటున్నారు.
News October 27, 2025
నల్గొండలో 85% ధాన్యం కేంద్రాలు ప్రారంభం: కలెక్టర్

నల్గొండ జిల్లాలో ఈ వానాకాలం ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 85 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. దేవరకొండ, చండూరు డివిజన్లలో వరికోతలు ఆలస్యం కావడంతో, మిగిలిన కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. HYD నుంచి మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కలెక్టర్ ఈ వివరాలు తెలిపారు.


