News July 9, 2024

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ డీఎంల బదిలీ

image

నల్గొండ ఆర్టీసీ రీజియన్‌లో పలువురు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ డీఎం బొల్లెద్దు పాల్‌ను ఆదిలాబాద్, నిజాంబాద్, కరీంనగర్ రీజియన్ల కార్గో ఏటీఎంగా, నల్గొండ డీఎం రామ్మోహన్ రెడ్డిని మిర్యాలగూడకు, రాజేంద్రనగర్ డీఎం ఎం.శ్రీనాథ్‌ను నల్గొండకు బదిలీ చేశారు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న దేవరకొండ డిపో డీఎం స్థానాన్ని టి.రమేష్ బాబుతో భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 1, 2024

NLG: లా పరీక్షలు వాయిదా

image

న్యాయశాస్త్రం 3, 5 సంవత్సరాల కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను వాయి దా వేస్తున్నట్లు నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల కన్వీనర్ ఉపేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. .

News October 1, 2024

ఆ బాధ్యత అధికారులపై ఉంది : కలెక్టర్

image

గ్రామాలలో ప్రజలకు రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంస్థల నిర్వహణపై చేయాల్సిన బాధ్యత జిల్లా స్థాయి మొదలుకొని, గ్రామ స్థాయి అధికారుల వరకు ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

News September 30, 2024

నల్గొండ: ఏసీబీకి చిక్కిన పశు వైద్యాధికారి

image

చింతపల్లి మండల పశు వైద్యాధికారి జోసఫ్ పాల్ రూ.6,000 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గేదెల బ్యాంకు లోన్, హెల్త్ సర్టిఫికెట్ కోసం నసర్లపల్లికి చెందిన ఓ రైతు వద్ద రూ.8వేలు డిమాండ్ చేసి రూ.6 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్ కి ఫోన్ చేయాలని ఉమ్మడి ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు.