News December 23, 2025
నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

చింతపల్లి: ర్యాలీపై దాడి.. పలువురికి గాయాలు
నల్గొండ: ప్రజావాణికి 53 దరఖాస్తులు
మునుగోడులో జీవో ప్రతులు దహనం
నల్గొండలో భారీ నిరసన
మిర్యాలగూడ: రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం
కొండమల్లేపల్లి: సర్పంచ్ ఇంటిపై దాడి
చండూరు: కుమారుడి ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి
అమెరికాలో నల్గొండ యువకుడి మృతి
నల్గొండ: మరో పథకానికి మంగళం
Similar News
News December 28, 2025
జిల్లా అధ్యక్షుడి తీరుపై అధిష్ఠానం సీరియస్..!

నల్డొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై పార్టీ అధిష్ఠానం స్పందించింది. వాజ్పేయి జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి సమక్షంలోనే నాయకుడు పిల్లి రామరాజుపై జరిగిన దాడిని రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని భావించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు.. వర్షిత్రెడ్డిని పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది.
News December 28, 2025
NLG: ముందుగానే మున్సి ‘పోల్స్’….!

మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎప్పుడు షెడ్యూల్ వచ్చినా… ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
News December 28, 2025
వణికిస్తున్న చలి.. పెరిగిన వైరల్ జ్వరాల ఉద్ధృతి

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వేకువజామున వీస్తున్న చలిగాలులతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరంతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.


