News December 7, 2024
నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన మధ్యాహ్నం 2.30 గంటలకు బ్రాహ్మణవెల్లంలకు చేరుకుంటారు. 2.40 గంటలకు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. 3.20గంటలకు యాదాద్రి ధర్మల్ పవర్ యూనిట్ -2 శక్తివంత స్టేషన్ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు నల్గొండ మెడికల్ కాలేజ్ని ప్రారంభిస్తారు. 5-6 గంటలకు పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు.
Similar News
News February 6, 2026
నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతా: మంత్రి

నల్గొండ పట్టణాన్ని అన్ని హంగులతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. శుక్రవారం 4, 5 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ కేశరాజుపల్లి నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు. నల్గొండ భవిష్యత్తును అందరం కలిసి నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
News February 6, 2026
NLG: జీరో ఎన్రోల్మెంట్ లోనూ నల్గొండ రికార్డు!

జీరో ఎన్రోల్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జీరో లేదా తక్కువ సంఖ్యలో విద్యార్థుల నమోదు దేశవ్యాప్తంగా ఉన్న 5,149 ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఉండగా.. అందులో NLG జిల్లాలో 315 నిర్వహణ లేని పాఠశాలలున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో గత కొన్నేళ్లుగా సర్కార్ స్కూళ్లను చిన్నచూపు చూస్తుండటమే దీనికి కారణంగా తెలుస్తుంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల ఆకర్షణ కూడా జీరో ఎన్రోల్మెంట్ మరో కారణం.
News February 6, 2026
NLG: కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకం

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ అదిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఒక్కో మున్సిపాలిటీకి ఒకరిద్దరు చొప్పున కోఆర్డినేటర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. NLG మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా ఎంఆర్ వినోద్రెడ్డిని నియమించారు. చండూరు మున్సిపాలిటీకి పీసరి మహిపాల్ రెడ్డి, హాలియాకు నాగ సీతారాములు, దేవరకొండకు కొట్నాల తిరుపతి నియమితులయ్యారు.


