News September 6, 2025
నల్గొండ జిల్లాలో 4 వేల విగ్రహాల నిమజ్జనం

జిల్లావ్యాప్తంగా 5,984 గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించగా.. సుమారు 4 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. గ్రామాల్లో కొంత మంది శనివారం కూడా నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్లగొండలోని వల్లభరావు చెరువు, మూసీ రిజర్వాయర్, 14వ మైలురాయి, MLG, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, DVK, కొండ బీమనపల్లి, డిండి వద్ద పెద్ద సంఖ్యల విగ్రహాలను నిమజ్జనం చేశారు.
Similar News
News September 6, 2025
NLG: వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా మృతి

వినాయక నిమజ్జనంలో శుక్రవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. తిప్పర్తి మండలం, మర్రిగూడెం గ్రామానికి చెందిన ఏశబోయిన యాదయ్య(45) వినాయక నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చుని ప్రమాదవశాత్తు పైనుంచి జారి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
News September 6, 2025
NLG: కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాగం ఏర్పాట్లు చేసుకుంటూ వెళుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా ప్రకటించిన విషయం విదితమే. అలాగే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది జాబితాల రూపకల్పన ఇలా.. ఎన్నికలకు ముందస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉండటంతో ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
News September 6, 2025
NLG: రేపు రేణుకా ఎల్లమ్మ ఆలయం మూసివేత

కనగల్(M) ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 7న ఆదివారం పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 3 గంటల వరకు ఆలయం మూసి వేయనున్నట్లు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో నాగిరెడ్డి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 7 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.