News February 23, 2025
నల్గొండ జిల్లా టాప్ న్యూస్

✓ SLBC టన్నెల్ పైకప్పు కూలి సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ✓ G- 20 సదస్సుకు ఎంపికైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థి ✓ కేతేపల్లిలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్ల మృతి ✓ ఉమ్మడి జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు ✓ తప్పుడు వార్త రాసిన విలేకరిపై చర్యలు తీసుకోవాలి: టీఎన్జీవో
Similar News
News February 23, 2025
NLG: నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో, SC, ST గురుకులాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష కోసం NLGలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు 12,929 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మైనార్టీ గురుకులానికి సంబందించి ఇంటర్మీడియట్లో చేరేందుకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News February 23, 2025
నల్గొండ: వణికిస్తున్న బర్డ్ ఫ్లూ

NLG, యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ మాంసప్రియులను వణికిస్తోంది. ఆదివారం వచ్చిందంటే చాలు కచ్చితంగా చికెన్ కావాలనే పరిస్థితి నుంచి కోడిమాంసం తెచ్చుకోవాలంటే జంకే స్థితికి ప్రజలు వచ్చారు. బాయిలర్ కోళ్లతోపాటు ఫారం కోళ్లు, నాటుకోళ్లు కూడా చనిపోతున్నాయి. నిడమనూరు మండలంలో నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. CPL మండలం నేలపట్లలో బర్డ్ ఫ్లూ కేసు నమోదైన సంగతి తెలిసిందే.
News February 23, 2025
మిర్యాలగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం

మిర్యాలగూడ మండలం చింతపల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్, బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.