News April 10, 2025
నల్గొండ: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 11,15,16 తేదీలలో జరుగబోయే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా టైం టేబుల్ ప్రకారం జరుగుతాయన్నారు.
Similar News
News February 1, 2026
పచ్చిపాలను ఇలా వాడితే..

* పచ్చి పాలు, తేనె కలిపి ఆ పేస్ట్ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కాటన్ బాల్స్తో శుభ్రం చేసుకోవాలి. కొద్ది సేపటికి చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * పచ్చి పాలలో అరటి పండును కలిపితే అది చర్మానికి మరింత మేలు చేస్తుంది. దీని కోసం కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.
News February 1, 2026
ఆదిలాబాద్: రేపటి నుంచి INTER ప్రాక్టికల్స్

జిల్లాలో ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ గణేశ్ కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాల్లో రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రశ్నాపత్రాలను ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరీక్షలు పారదర్శకగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News February 1, 2026
బడ్జెట్ బూస్ట్.. ఎగసిన స్టాక్ మార్కెట్లు

ఉదయం ఫ్లాట్గా మొదలైన స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చాయి. కేంద్ర మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం మొదలైన తర్వాత మెల్లగా పైకెగిశాయి. ప్రస్తుతం నిఫ్టీ 60 పాయింట్లు, సెన్సెక్స్ 250 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ 25,370, సెన్సెక్స్ 82,521 వద్ద కొనసాగుతున్నాయి.


