News September 6, 2024

నల్గొండ: నిషేధం ముగిసింది.. సర్పంచ్ ఎన్నికకు సై  

image

గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయక నిషేధం బారిన పడిన అప్పటి అభ్యర్థులు ఇప్పుడు పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. వారిపై ఎన్నికల సంఘం విధించిన మూడేళ్ల సమయం ముగిసింది. 2019లో జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 1097 మందిపై ఎన్నికల్లో పోటీచేయకుండా 2021లో నిషేధం పడింది. 2024 జులైతో వారి నిషేధ కాలం ముగిసి ఊరట లభించినట్లేనని అధికారులు తెలిపారు.

Similar News

News October 31, 2025

NLG: ఆ నిబంధనలు.. రైతులతో పరిహాసమే!

image

అటు ప్రకృతి.. ఇటు పాలకులు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీగానే పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నేలవాలడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. 33 శాతానికి పైగా దెబ్బతింటేనే పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 61,511 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

News October 31, 2025

NLG: 61, 511 ఎకరాల్లో పంట నష్టం

image

‘మొంథా’ జిల్లాలో రైతులను నిలువునా ముంచింది. వర్షం కారణంగా వరి, పత్తి, మిర్చి పంటలు, రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. 310 గ్రామాల్లో 30,359 మంది రైతులకు చెందిన 61,511 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వం 33 శాతం పైబడి పంట నష్టపోయిన వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలకు తీరని నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.

News October 31, 2025

NLG: నేటి నుంచి రైళ్ల పునరుద్ధరణ

image

సికింద్రాబాద్ నుంచి BNG మీదుగా విజయవాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు. మొంథా తుపాన్ కారణంగా ఆయా స్టేషన్లకు భువనగిరి మీదుగా వెళ్లే గౌతమి, గోదావరి, కృష్ణా ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. డోర్నకల్లో వరద నీరు ఉండడంతో ఆయా రైళ్లను NLG రైలు మార్గం గుండా వెళ్లేందుకు మళ్లించారు. తెలంగాణ, దక్షిణ ఎక్స్ప్రెస్ రైళ్లు BNG మీదుగా వెళ్లే అవకాశం ఉంది.