News October 20, 2025
నల్గొండ: పత్తి కూలీల ఆటో, ట్రాక్టర్ ఢీ

ముప్పారంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకంలో ముంచింది. పత్తికూలీల ఆటోను ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో ఆలంపల్లి సాయిలు అనే కూలీ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో 8 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను 108లో మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News October 20, 2025
NLG: అమ్మో ఈ ఆలయాలకు వెళ్లాలంటేనే..

జిల్లాలో ఈజీ మనీ కోసం ట్రాన్స్ జెండర్లు వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పలు ఆలయాల వద్ద తిష్ట వేస్తున్న ట్రాన్స్జెండర్లు భక్తుల నుంచి అడ్డగోలుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నిడమనూరు(M) కోట మైసమ్మ, కనగల్(M) దర్వేశిపురం ఆలయాల వద్ద అమ్మవార్లకు మొక్కుబడులు చెల్లించేందుకు, కొత్త వాహనాలకు పూజలు చేసుకునేందుకు వచ్చిన భక్తుల వద్దకు గుంపులుగా చేరుకొని ట్రాన్స్జెండర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
News October 20, 2025
మంత్రి కోమటిరెడ్డి దీపావళి విషెస్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని ‘జ్ఞాన వెలుగులు నింపే పండుగ’గా ఆయన అభివర్ణించారు. దీపాలు చీకటిని తరిమినట్టుగానే, ఈ పండుగ ప్రజల జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ప్రతి ఇంట్లో సకల శుభాలు కలిగించాలని కోరారు.
News October 20, 2025
నల్గొండ: రేకుల షెడ్లో ఉంటున్నాం.. ఇల్లు ఇవ్వరూ..!

త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు దక్కడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా నాయకులు అనర్హులకు ఇళ్లను కేటాయించి తమను విస్మరిస్తున్నారని కొల్లి సరస్వతి, దుర్గయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేకుల షెడ్లో నివసిస్తున్నామని, అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.