News December 1, 2025
నల్గొండ: పార్లమెంటులో సమస్యలపై గళమెత్తాలి..!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిసెంబర్ 19 వరకు జరిగే సమావేశాల్లో నియోజకవర్గాలలోని సమస్యలపై ఎంపీలు మాట్లాడి పరిష్కారం దిశగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News December 1, 2025
WNP: అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి

ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని, తమ విధులు,బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం మదనాపురం జెడ్పి బాయ్స్ హైస్కూల్ నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
News December 1, 2025
పెద్దపల్లి: 35 కంప్యూటర్ల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు 35 కంప్యూటర్ల సరఫరా కోసం ఆసక్తి గల సరఫరాదారులు డిసెంబర్ 4లోగా దరఖాస్తులు సమర్పించాలని ఇన్చార్జ్ డీఈఓ శారద తెలిపారు. దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో స్వీకరించబడతాయి. వివరాలకు సెక్టోరల్ అధికారి సి.హెచ్. మల్లేష్ గౌడ్ (ఫోన్: 9959262737) ను సంప్రదించవచ్చు.
News December 1, 2025
ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ నరసింహ

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. పెన్ పహాడ్ మండల కేంద్రంలో నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే, ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.


