News June 19, 2024
నల్గొండ: పెట్రోల్ బంకుల్లో మోసాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని బంకుల్లో మోసాలు జరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ తక్కువగా వస్తోందని, అందులోనూ కల్తీ జరుగుతోందని వినియోగదారులు తరచూ ఆందోళనకు దిగుతున్నా అధికారుల పర్యవేక్షణ కరువైంది. గన్ తీయగా పెట్రోల్ కొట్టకముందే రూ.5.70 చూపిస్తోందని సూర్యాపేటలో ఓ వినియోగదారుడు తెలిపాడు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ మోహన్ బాబు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 500పైనే బంకులున్నాయి.
Similar News
News February 16, 2026
చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లాలోని చెరువులు, కుంటల ఆక్రమణలపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రంలో ఆక్రమణలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జలవనరులు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో కబ్జాలకు తావులేకుండా నిఘా పెంచాలని స్పష్టం చేశారు.
News February 16, 2026
సమష్టి కృషితో జిల్లా ప్రగతి: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి 82 వినతులను స్వీకరించారు. కోర్టు కేసులు, కమిషన్లలో పెండింగ్లో ఉన్న అంశాలపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. మార్చి నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
News February 16, 2026
నల్గొండ: బందోబస్తు పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్రపవార్

నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్తోపాటు 6 మున్సిపాలిటీల్లో మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల ప్రక్రియను జరిపేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.


