News January 13, 2026
నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ ఫోకస్

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు కలెక్టర్ చంద్రశేఖర్ చర్యలు ముమ్మరం చేశారు. గతవారం జిల్లాలో 4,600 ఫిర్యాదులు పెండింగ్లో ఉండగా, అధికారుల కృషితో ఈ వారం నాటికి ఆ సంఖ్య 1,699కి తగ్గింది. వచ్చే వారం నాటికి పెండింగ్ ఫిర్యాదుల సంఖ్యను 500 లోపుకు తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 10, 2026
మున్సిపల్ సమరానికి సర్వం సిద్ధం: నల్గొండ కలెక్టర్

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 11న జరిగే ఎన్నికల సరళిపై మంగళవారం ఆయన ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి సమీక్షించారు. జిల్లాలో నల్గొండ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా, దేవరకొండ మున్సిపాలిటీల్లో మొత్తం 473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
News February 10, 2026
NLG: లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలే లక్ష్యం: వీపీ గౌతమ్

చిట్యాల మండలం పెద్దకాపర్తిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ సెక్రెటరీ వీపీ గౌతమ్, కలెక్టర్ బీ.చంద్రశేఖర్తో కలిసి తనిఖీ చేశారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మార్చి చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలే లక్ష్యమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయలక్ష్మి, సర్పంచ్ కాటం వెంకటేశం, తదితర అధికారులు పాల్గొన్నారు.
News February 10, 2026
పాత నేరస్థులపై బైండోవర్ కేసులు: నల్గొండ ఎస్పీ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇప్పటికే 333 మంది రౌడీషీటర్లు, పాత నేరస్థులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా చేరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం, నగదు పంపిణీపై నిఘా ఉంచామని జిల్లా ఎస్పీ తెలిపారు.


