News February 15, 2026
నల్గొండ: ప్రసిద్ధ శైవాలయాలు.. మీరు వెళ్తున్నారా?

☛ వాడపల్లిలో శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి ఆలయం
☛ చెర్వుగట్టులో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం
☛ సూర్యాపేటలో పిల్లలమర్రి శివాలయం
☛ మేళ్లచెర్వులో ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం
☛ ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం
☛ ఆలేరులో కొలనుపాక శివాలయాలు
☛ నాగిరెడ్డిపల్లిలో పాహిల్వంపూర్ గోల్డెన్ శివాలయం
Similar News
News February 15, 2026
ఉండవల్లిలో సీఎం పర్యటన.. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

సోమవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి ఉండవల్లి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు.
News February 15, 2026
రేపు ప్రజావాణి రద్దు: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల దృష్ట్యా ఈ వారం ప్రజావాణిని రద్దు చేశామన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
News February 15, 2026
రాజన్న సన్నిధిలో క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యవేక్షణ

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ మేరకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ కౌంటర్లను పరిశీలించి, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.


