News September 10, 2025
నల్గొండ: ప్రాజెక్టులు పూర్తైతే పెరగనున్న సాగు విస్తీర్ణం

ఉమ్మడి NLG జిల్లా రైతులకు మహర్ధశ పట్టనుంది. మంగళవారం జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ 2027 నాటికి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. SLBC పూర్తైతే సుమారు 4 లక్షల ఎకరాలు, డిండి ఎత్తిపోతల కింద మూడున్నర లక్షల ఎకరాలు, బస్వాపూర్ కింద 23 వేల ఎకరాలు, మరికొన్ని ప్రాజెక్టులు కింద కలుపుకుని 8 లక్షల ఎకరాలకు పైనే సాగు విస్తీర్ణం పెరగనుంది.
Similar News
News September 10, 2025
మెదక్: తొమ్మిది నెలల్లో 648 మంది సూసైడ్

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 648 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 204, మెదక్లో 228, సిద్దిపేటలో 216 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
News September 10, 2025
రాజాంలో రేపు జాబ్ మేళా

రాజాం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంతకుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా పీజీ చదివి వయసు 18-35లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు. 12 బహుళజాతి కంపెనీలు జాబ్ మేళాకు హాజరవుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
News September 10, 2025
యువత ప్రాణాలు తీస్తున్న బ్రేకప్స్

దేశంలో బ్రేకప్ల వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సూసైడ్ ప్రివెంటివ్ హెల్ప్లైన్ సంస్థ ‘వన్ లైఫ్’ తెలిపింది. అప్పులు, వైవాహిక సమస్యలు, నిరుద్యోగం, బెట్టింగ్, ఒత్తిడి, ఆర్థిక మోసాలతో మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నట్లు వివరించింది. తమ సంస్థకు ఏటా సగటున 23,000 కాల్స్ వస్తున్నాయంది. ఫోన్ చేసిన వారిపై సానుభూతి చూపిస్తూ కౌన్సిలర్లు వారిలో ధైర్యం నింపుతారని వివరించింది.
* ఇవాళ ఆత్మహత్యల నివారణ దినోత్సవం