News January 20, 2026

నల్గొండ: బత్తాయి రైతులకు ‘సంఘ’ బలమే శ్రీరామరక్ష : కలెక్టర్

image

బత్తాయి రైతులు ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తూ లాభాలు గడించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం రైతుల అనుభవాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దళారుల దోపిడీని అరికట్టి, గిట్టుబాటు ధర సాధించాలంటే ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాల’ (FPO) ఏర్పాటు ఆవశ్యకమని స్పష్టం చేశారు. మార్కెటింగ్, నిల్వ సౌకర్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.

Similar News

News February 17, 2026

హాలియాలో ఘోర ప్రమాదం: దంపతుల మృతి

image

నల్గొండ హాలియా సాగర్ ఎడమ కాలువ వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ వాహనాన్ని లారీ వేగంగా ఢీకొనడంతో పెద్దవూర మండలం కొత్తగూడెంకు చెందిన భార్యాభర్తలు వెంకటయ్య(55), మల్లమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందారు. హాలియా నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సీఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 17, 2026

మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి

image

నల్గొండ నుంచి HYD వెళుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. చిట్యాల సమీపంలోని గుండ్రాంపల్లి వద్ద జరిగిన ప్రమాదాన్ని చూసి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపారు. క్షతగాత్రులను పరామర్శించి, తన వాహన శ్రేణిలోని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రిపై సర్వత్రా ప్రశంసలు కురిస్తున్నాయి.

News February 16, 2026

చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లాలోని చెరువులు, కుంటల ఆక్రమణలపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రంలో ఆక్రమణలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జలవనరులు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో కబ్జాలకు తావులేకుండా నిఘా పెంచాలని స్పష్టం చేశారు.