News March 10, 2025

నల్గొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఆదివారం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం తమ అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దాసోజు శ్రవణ్ కుమార్‌కు ఈసారి అవకాశం కల్పించారు. ఆయన ఎంపిక పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు.

Similar News

News March 10, 2025

నల్గొండ: ఎమ్మెల్సీ సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

image

శాసనమండలి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖారారైంది. హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో ఆదివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం NLG జిల్లా సీపీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

News March 10, 2025

నల్గొండ: స్వల్ప మెజారిటీతో అద్దంకి ఓటమి..!

image

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప మెజారిటీతో అద్దంకి దయాకర్ ఓడిపోయారు. ఈయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామం. దయాకర్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. కాగా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుంటారని ఈయనకు పేరు.

News March 10, 2025

నల్గొండ: శంకర్ నాయక్ రాజకీయ నేపథ్యం ఇదే..

image

NSUI యూత్ కాంగ్రెస్ నేతగా కెతావత్ శంకర్ నాయక్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఈయన 90లలో అప్పటి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు రాగ్యానాయక్ అనుచరుడిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్‌గా గెలిచారు. సీనియర్ పార్టీ నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. తర్వాత ఉమ్మడి దామరచర్లకి ఎంపీపీ, జడ్పీటీసీగా చేశారు. మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి ప్రస్తుతం NLG డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

error: Content is protected !!