News October 9, 2024
నల్గొండ: యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి నర్సిరెడ్డి

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం టీఎస్యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అలుగుబెల్లి నర్సిరెడ్డి బరిలో నిలవనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను 2025 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో నిలపాలని TSUTF రాష్ట్ర కమిటీ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. వర్చువల్గా నిర్వహించిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదించారు.
Similar News
News April 7, 2026
నల్గొండలో 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

నల్గొండ జిల్లాలో ఈ నెల 20 నుంచి మే 5 వరకు పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO బిక్షపతి తెలిపారు. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు, ప్రాక్టికల్స్ ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు జరుగుతాయని తెలిపారు. మొత్తం 3,837 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. దేవరకొండ, మిర్యాలగూడ, నల్గొండల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News April 7, 2026
NLG: ప్రశాంతంగా జీవశాస్త్రం పరీక్ష.. 41 మంది గైర్హాజరు

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ బిక్షపతి తెలిపారు. మొత్తం 106 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు సాధారణ విద్యార్థులు 19,698 మందికి గానూ 19,663 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 103 మందికి గానూ 97 మంది రాశారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 41 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.
News April 7, 2026
NLG: యాచారంలో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్

అనుముల మండలం యాచారంలో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 14 వేల ఎకరాల్లో సాగు ఉండగా, ప్రస్తుతం 2,500 ఎకరాల్లో పంట కోత దశకు చేరింది. రైతులకు రవాణా ఖర్చులు తగ్గించి, ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ మిల్లును నిర్మిస్తున్నారు. ప్రాథమికంగా గంటకు 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభించి, భవిష్యత్తులో దీనిని 120 టన్నులకు విస్తరించనున్నారు.


