News March 17, 2025
నల్గొండ: రాముడి ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

నల్గొండ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సూత్రం పాటిస్తారని మరోసారి రుజువు చేశాడు ఆ వ్యక్తి.. నల్గొండ జిల్లా నాంపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి నాంపల్లి మండలం తిరుమలగిరి వాసి మహమ్మద్ రవూఫ్ చోటే తన వంతు సాయంగా రూ.60,000 విరాళంగా అందజేశారు. దీంతో దేవాలయ కమిటీ ఛైర్మన్ కోట రఘునందన్, కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 18, 2025
AP న్యూస్ రౌండప్

* ఒడిశాలో జరిగిన ఏకలవ్య మోడల్ స్కూల్స్ నేషనల్ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన గిరిజన విద్యార్థులు 32 బంగారు, 42 వెండి, 40 కాంస్య పతకాలు సాధించారు.
* రాజమండ్రిలో రూ.100 కోట్లతో పైలట్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జార్విస్ ఏవియేషన్ సంస్థ వెల్లడించింది.
* ఇస్రో, TIFR, అణుశక్తి విభాగాల ఆధ్వర్యంలో డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో సైంటిఫిక్ బెలూన్ ప్రయోగాలు జరగనున్నాయి.
News November 18, 2025
AP న్యూస్ రౌండప్

* ఒడిశాలో జరిగిన ఏకలవ్య మోడల్ స్కూల్స్ నేషనల్ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన గిరిజన విద్యార్థులు 32 బంగారు, 42 వెండి, 40 కాంస్య పతకాలు సాధించారు.
* రాజమండ్రిలో రూ.100 కోట్లతో పైలట్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జార్విస్ ఏవియేషన్ సంస్థ వెల్లడించింది.
* ఇస్రో, TIFR, అణుశక్తి విభాగాల ఆధ్వర్యంలో డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో సైంటిఫిక్ బెలూన్ ప్రయోగాలు జరగనున్నాయి.
News November 18, 2025
ADB: ఉపకార వేతనం మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం

2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


