News November 25, 2025
నల్గొండ: రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు

నల్గొండ జిల్లాలో యాసంగి పంట సాగుకు సిద్ధమవుతున్న 10.82 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ప్రభుత్వం ఏటా రూ.12,000 అందిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ యాసంగి సహాయం ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News November 25, 2025
నర్సంపేటలో విషాదం.. పుట్టినరోజునే మృత్యుఒడికి!

నర్సంపేట పట్టణంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో వివాహిత మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రత్యూష ఇంటి ప్రాంగణంలో ఆరుబయట ఆరవేసిన బట్టలు తీస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు 8 నెలల గర్భిణి కాగా.. ఇవాళ ఆమె పుట్టినరోజు అని స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.
News November 25, 2025
ప్రకాశం: రహదారి దాటుతున్నారా.. ఈ రూల్స్ తెలుసుకోండి.!

రహదారి దాటుతున్నారా.. కాస్త రూల్స్ పాటించండి అంటున్నారు ప్రకాశం పోలీస్. ఇప్పటికే సైబర్ నేరాలపై, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్న ప్రకాశం పోలీసులు మంగళవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటన జారీ చేశారు. రహదారులు దాటే సమయంలో ప్రతి ఒక్కరూ జీబ్రా లైన్లను ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తప్పనిసరిగా సిగ్నల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు.
News November 25, 2025
మహిళల ఆర్థికాభివృద్ధికి క్రమశిక్షణే ముఖ్యం: ఇలా త్రిపాఠి

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు క్రమశిక్షణగా, ధైర్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఈ రోజు నల్గొండలో 22,997 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.26.34 కోట్ల చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా సంఘాలు జాతీయస్థాయి అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.


