News May 12, 2024
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేటలో జరిగింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. కోదాడ – జడ్చర్ల రహదారిపై అంగడిపేట వద్ద ఉన్న పెట్రోల్ బంక్లో డీజిల్ పోయించుకుని వస్తున్న ఆటోను హెడ్ కానిస్టేబుల్ మర్యాదాస్ ఆపాడు. ఈ క్రమంలో వెనకనుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. హెడ్ కానిస్టేబుల్కు గాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News January 23, 2026
గురుకుల ప్రవేశాల గడువు 25 వరకు పొడిగింపు

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ స్వప్న తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
News January 23, 2026
నల్గొండ మీదుగా ‘అమృత్ భారత్’ రైలు

నల్గొండ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. HYD చర్లపల్లి నుంచి కేరళలోని తిరువనంతపురానికి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్లనుంది. వారంతపు సర్వీసుగా నడిచే ఈ రైలులో 11జనరల్, 8స్లీపర్ కోచ్లతో పాటు దివ్యాంగుల కోసం రెండు ప్రత్యేక బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. తక్కువ ఛార్జీతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
News January 23, 2026
NLG: మూగజీవాల దాహార్తిని తీర్చాలి: కలెక్టర్

వేసవిలో జంతువుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన SPCA సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండల దృష్ట్యా పట్టణాలు, గ్రామాల్లో జంతువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఆవుల దత్తతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పశువులకు నీడ, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం గ్రామీణ పశు వైద్యులకు ఎండోస్కోప్ కిట్లను పంపిణీ చేసారు.


